Pallavi Prashanth Fans: అమర్ తో పాటు వేరే కంటెస్టెంట్స్ కార్ల పై దాడి చేసిన ప్రశాంత్ అభిమానులు…వార్నింగ్ ఇస్తూ రచ్చ చేసిన వీడియొ వైరల్



Pallavi Prashanth Fans

Pallavi Prashanth Fans: బిగ్ బాస్ సీజన్ 7 నిన్న ఆదివారం తో ముగిసిన సంగతి అందరికి తెలిసిందే.14 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన ఈ సీజన్ లో ఆ తర్వాత మరో అయిదుగురు వైల్డ్ కార్డు ఎంట్రీ తో హౌస్ లోకి అడుగు పెట్టారు.ఇక చివరకు ప్రతి వారం ఎలిమినేషన్ జరుగుతూ 15 వారలు పూర్తి అయ్యే సరికి ఆరుగురు మిగిలారు.ఎంతో ఆసక్తిగా సాగిన ఈ సీజన్ ఫైనల్ లో పల్లవి ప్రశాంత్ విన్నర్ గా,అమర్ డీప్ రన్నరప్ గా నిలిచారు.

పల్లవి ప్రశాంత్ అభిమానులు ముందు నుంచి సోషల్ మీడియా లో హంగామా చేస్తున్న సంగతి తెలిసిందే.బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైనా పల్లవి ప్రశాంత్ ను ఏమైనా అంటే ప్రశాంత్ అభిమానులు,మనుషులు ఈ కంటెస్టెంట్స్ మీద వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ మీద అసభ్య పదాలతో దాడి చేసారు.ప్రశాంత్ అభిమానులు మమ్మల్ని వేధిస్తున్నారు అంటూ సందీప్ ఫ్యామిలీ చెప్పిన సంగతి కూడా అందరికి తెలిసిందే.

Pallavi Prashanth Fans

బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ రోజు బిగ్ బాస్ హౌస్ ముందు కంటెస్టెంట్స్ అభిమానులు భారీ గా తరలివస్తారు.తమకు ఇష్టమైన కంటెస్టెంట్ బయటకు వచ్చినప్పుడు వారిని ఊరేగింపుగా తీసుకోని వెళ్లారు అభిమానులు.ఇక ఈ సారి కూడా అన్నపూర్ణ స్టూడియోస్ ముందు భారీగా పల్లవి ప్రశాంత్ అభిమానులు రావడం జరిగింది.

 

View this post on Instagram

 

A post shared by Ashwini Sree (@ashwinii_sree)

ప్రశాంత్ అభిమానులు ప్రశాంత్ కంటే ముందుగా వచ్చిన కంటెస్టెంట్స్ పై వారి కార్లపై రాళ్లతో దాడి చేయడం జరిగింది.ప్రశాంత్ అభిమానులు రాళ్లతో దాడి చేసి వారి కారు అద్దాలను పగలకొట్టారు.అమర్,అశ్విని,హర్ష,శోభా శెట్టి ఇలా పలువురు కంటెస్టెంట్స్ కారు అద్దాలను పగలకొట్టారు ప్రశాంత్ అభిమానులు.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *