KA Paul : సిద్ధం స‌భ‌ల‌పై కేఏ పాల్ పంచ్‌లు.. ప‌గ‌ల‌బ‌డి నవ్వుతున్న నెటిజ‌న్స్


KA Paul : ఏపీలో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్ది ప్ర‌చారాలు జోరుగా సాగుతున్నాయి. ఒకరిపై ఒక‌రు దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రతో దూసుకెళ్తున్నారు ఈ యాత్రలో భాగంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు.. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్ర‌తిప‌క్షాల‌పై విసుర్లు విసురుతూ ముందుకు సాగుతున్నారు. అయితే జ‌గ‌న్‌పై ఆయ‌న ఏర్పాటు చేసిన సిద్దం స‌భ‌ల‌పై కేఏ పాల్ వేసిన పంచ్‌లు అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చ‌డ‌మే కాక న‌వ్వులు పూయిస్తున్నాయి. జ‌గ‌న్ మీటింగ్ పెట్టి ఓడిపోవ‌డానికి సిద్దం,అప్పులు చేయ‌డానికి సిద్ధం, స్టీల్ ప్లాంట్ అమ్మేయ‌డానికి సిద్ధం, మోడీకి అమ్ముకుపోవ‌డానికి సిద్ధం అంటూ ఆయ‌న చెబుతున్నారు అని కేఎల్ పాల్ అన్నారు.

నటులు న‌టులే. వారు రియ‌ల్ పీపుల్ కాదు.జ‌గ‌న్ పాదయాత్ర చేసిన‌ప్పుడు ఆయ‌న ఇచ్చిన వాగ్ధానాలు న‌వ‌ర‌త్నాలు. మోడీని వ‌ణికిస్తాం అని అన్నాడు. ఇప్పుడు అక్క‌డికి వెళ్లి మ‌సాజ్ చేస్తున్నాడు. ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌లేదు. కాని వారు 95 శాతం నెర‌వేర్చిన‌ట్టు చెబుతున్నారు. ఇవ‌న్నీ గాలి మాట‌లు అంటూ పాల్ పంచ్‌లు విసిరారు. ఆయ‌న మాట‌ల‌కి మాత్రం నెటిజ‌న్స్ తెగ ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ అధినేత కేఏ పాల్ విశాఖ లోక్ సభ స్థానం నుంచి బరిలో నిలుస్తారని… ఆయనకు మద్దతుగా తాను ప్రచారం చేస్తానని ఇటీవలే ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబు మోహన్ స్పష్టం చేశారు.

KA Paul satirical comments on sidham meetings
KA Paul

ఇటీవల కేఏ పాల్ మాట్లాడుతూ… తాను విశాఖ నుంచి పోటీ చేస్తానని, బాబు మోహన్ తెలంగాణలోని వరంగల్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తారని చెప్పారు. తాజాగా కేఏ పాల్ పోటీపై బాబు మోహన్ మరోసారి స్పందించారు. ఇదిలా ఉండగా మునుగోడు ఉప ఎన్నికల్లో కేఏ పాల్‌కు 805 ఓట్లు రాగా, 2019లో నర్సాపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేయగా 281 ఓట్లు వచ్చాయి. మ‌రిఈ సారి పాల్ ఎలాంటి ప్ర‌భంజ‌నం సృష్టిస్తాడు. ఎన్నిక‌ల‌లో ఎలాంటి ఫ‌లితాలు చ‌విచూస్తాడు అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *