Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలతో మరోవైపు రాజకీయాలతో బిజీ గా ఉన్నారు.కొద్దీ రోజుల క్రితం సినిమా షూటింగ్ తో బిజీ గా ఉన్న ఆయన ప్రస్తుతం వారాహి యాత్రలో ఉన్న సంగతి అందరికి తెలిసిందే.రాజకీయ ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలోని పిఠాపురం లో జూన్ 16 న పర్యటించారు.పవన్ కళ్యాణ్ ను చూసేందుకు అక్కడికి భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు.
ఈ పర్యటనలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటు యువతను ఉద్దేశిస్తూ సినిమాలు స్టార్స్ గురించి కూడా పలు ఆసక్తికరమైన విషయాలను యువతతో పంచుకున్నారు.ప్రస్తుతం ఆయన చెప్పిన విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.రాజకీయం వేరు సినిమాలు వేరు సినిమాల పరంగా యువత ఏ హీరో ని అయినా అభిమానించవచ్చు కానీ రాజకీయం విషయానికి వస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరు ఒక్కచోటుకే చేరాలన్నారు.
యువత అంత ఒక్కటై రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించాలి అని ఆయన చెప్పుకొచ్చారు.తన తోటి నటీనటులంటే తనకు ఎంతో గౌరవం అని వారి సినిమాలను కూడా తానూ చూస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు.తెలుగులో తనకు యంగ్ టైగర్ ఎన్టీఆర్,ప్రభాస్,రామ్ చరణ్,చిరంజీవి అంటే ఇష్టం అని పవన్ తెలిపారు.తాజాగా పవన్ చేసిన కామెంట్ లకు సంబంధించిన వీడియొ సోషల్ మీడియా ప్లేట్ ఫారం లలో వైరల్ అవుతుంది.
Source link