సింహాద్రిలో ఎన్టీఆర్‌ని ఓ ఆట ఆడించిన అంకిత ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తుంది..?


యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన సూప‌ర్ హిట్ చిత్రాల‌లో సింహాద్రి ఒక‌టి. ఈ సినిమాలో భూమికతోపాటు.. హీరోయిన్ అంకిత కూడా తన నటనతో ఆకట్టుకుంది. ఈ మూవీలోనే కాకుండా..లాహిరి లాహిరి లాహిరిలో.. ధనలక్ష్మి ఐ లవ్ యూ, ప్రేమలో పావని కళ్యాణ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే 2009 వరకు వరుసగా సినిమాలు చేసిన అంకిత.. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. సింహాద్రి చిత్రం 2003 జూలై 9 వ తేదీన విడుదలై అప్పట్లో పేను సంచలనాన్ని సృష్టించింది. దాదాపుగా ఈ సినిమాని రూ .8కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో నిర్మించారు.

చివరిసారిగా 2009లో వచ్చిన పోలీస్ అధికారి చిత్రంలో కనిపించింది అంకిత‌. ఆ తర్వాత చిత్రాలకు పూర్తిగా దూరమైంది. ప్రస్తుతం ఆమె ఏం చేస్తుంది , ఎక్క‌డుంది అనే విష‌యం చాలా మందికి తెలియ‌దు. అంకిత.. బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అప్పట్లో ఫేమస్ అయిన రస్నా యాడ్ లో నటించి పాపులర్ అయ్యింది. ఆ తర్వాత పలు కమర్షియల్ ప్రకటనలలో నటించింది. ఆ తర్వాత వైవీఎస్ చౌదరి తెరకెక్కించిన లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమైంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అప్పట్లో అంకితకు ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉండేది.

అయితే వరుస హిట్స్ అందుకున్న ఆమె.. ఆ తర్వాత మెల్లగా ప్లాపులను కూడా ఖాతాలో వేసుకుంది. దీంతో అవకాశాలు తగ్గాయి. కొన్నాళ్ల తర్వాత పూణెకు చెందిన వ్యాపారవేత్త విశాల్‏ను పెళ్లి చేసుకుంది అంకిత. ఇక అనంతరం సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ప్రస్తుతం ఆమె తన తండ్రికి సంబంధించిన వజ్రాల వ్యాపారాన్ని చూసుకుంటూ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తుంది. అంకిత సోషల్ మీడియాలోనూ చాలా సైలెంట్. దీంతో ఆమె గురించి ఎవ‌రికి పెద్ద‌గా స‌మాచారం తెలియ‌దు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *