మ‌హాన‌టి సావిత్రి వ‌ల్ల‌నే కోటీశ్వ‌రుడిన‌య్యానంటూ కామెంట్ చేసిన ల‌లిత జ్యువెల‌ర్స్ ఎండీ


ల‌లిత జ్యువెల‌ర్స్ ఎండీ కిర‌ణ్ కుమార్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. టీవీల్లో త‌న కంపెనీకి సంబంధించి ప్ర‌చారాల‌ని వినూత్నంగా చేసుకుంటూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు కిర‌ణ్‌.ఎన్నో కంపెనీలకు మరియు ప్రొడక్ట్స్‌కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు మ‌నం చూస్తూ ఉంటాం.అయితే లలిత జ్యూవెలరీ యాడ్‌ మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎవరు మోడల్స్‌ ఉండరు, అందాల ముద్దుగుమ్మలు ఆ యాడ్స్‌లో కనిపించరు, లలిత జ్యూవెలర్స్‌ కంపెనీకి తానే ఒక పెద్ద బ్రాండ్‌ అంబాసిడర్‌ గా మారిన కిరణ్‌ కుమార్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. నా కంపెనీకి నేనే అంబాసిడర్‌గా వ్యవహరిస్తాని మొదలు పెట్టిన ఆయన అనూహ్యంగా గుర్తింపు దక్కించుకున్నాడు.

ఎక్కువ శాతం మంది ఆయన మాట తీరును చూసి తెలుగు వ్యక్తి కాదని అనుకుంటారు..కాని ఆయన పక్కా తెలుగు వ్యక్తి.నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి, అయితే తమిళనాడుకు కాస్త ద‌గ్గరగా ఉండటం వల్ల భాష మరియు యాసలో కాస్త తేడాగా ఉంటుంది.కిరణ్‌ కుమార్‌ నెల్లూరులో బంగారపు వస్తువులు తయారు చేసే వర్క్‌ షాపులో నెల సరి జీతానికి పని చేసేవాడు. వ్యాపారవేత్తగా ఎంతో సక్సెస్ అయి కోట్లాది ఆస్తులకు అధిపతి అయ్యారు. అయితే తాను ఇంత సక్సెస్ కావడానికి కారణం మహానటి సావిత్రి అని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

lalitha jewellers md told about savithri

చెన్నైలో మహానటి సావిత్రి ఇంటిని కొనుగోలు చేసి అక్కడే వ్యాపారాన్ని విస్తరించాన‌ని అన్నాడు కిర‌ణ్ కుమార్. సావిత్రి పిల్లలు ఆమె పేరు మీద ఒక కమర్షియల్ బిల్డింగ్ కట్టారని, దాన్ని రెంటుకు తీసుకొని బంగారం షాప్ మొదలు పెట్టానని, సావిత్రి ఆశీర్వాదం వల్లే నా వ్యాపారం బాగా నడిచిందని ఇంత పెద్ద సక్సెస్ అయ్యానని కిర‌ణ్ కుమార్ పేర్కొన్నారు. అందుకే ఇప్పటికీ ఆమె పేరు మీదే బిల్డింగ్ ఉందని తెలియజేశారు. అది కేవలం లలిత కార్పొరేట్ ఆఫీస్ అని మాత్రమే రాశాము కానీ సావిత్రి గణేష్ గారి పేరు మీదే ఉంచామని తెలియ‌జేశాడు. ఓ సంద‌ర్భంలో సావిత్రి కూతురు చాముండేశ్వ‌రి మాట్లాడుతూ.. అమ్మకు బంగారం అంటే చాలా ఇష్టం. కిరణ్ కుమార్ ది బంగారం షాపు. అమ్మకు కార్లు అంటే ఇష్టం. కిరణ్ కు కూడా చాలా ఇష్టం. ఈ విధంగా అభిప్రాయాలు కలవడంతో ఆయ‌న‌కు అమ్మేశామ‌ని చెప్పుకొచ్చింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *